calender_icon.png 26 June, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యేక బస్సు టూర్ ప్యాకేజీని వినియోగించుకోవాలి

25-06-2025 12:30:12 AM

కలెక్టర్ దివాకర టి.ఎస్

ములుగు ప్రతినిధి, జూన్24 (విజయక్రాంతి): జిల్లా ప్రజలు ప్రత్యేక బస్సు టూర్ ప్యాకేజీని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు.మంగళవారం తన ఛాంబర్ లో ప్రత్యేక టూర్ ప్యాకేజీ పోస్టర్, ప్రచార కరపత్రాలను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రూట్ - 1లో రామప్ప- భోగతా జలపాతం -మల్లూరు  ఎక్సప్రెస్ బస్సు ద్వారా  సందర్శనకు ఒక్కొక్కరికి 530/-. ఒక్కరోజుకు అదేవిధంగా రూట్- 2ద్వారా పంచారామాలు ప్రసిద్ధ 5 శివాక్షేత్రలైన అమరావతి, బీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట సందర్శనకు ఒక్కొక్కరికి 2300/-రెండు రోజులు భక్తులు ఇట్టి సౌకర్యాన్ని వినియోగించు కోవాలని,హనుమకొండ బస్సు స్టాండ్ నుండి ఈ నెల 27న పంచారామాలు యాత్ర బస్సు బయలుదేరుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వరంగల్-2 డిపో మేనేజర్ జ్యోత్స్న,కలెక్టరేట్ పరిపాలనా అధికారి రాజ్ కుమార్, జిల్లా అధికార, తదితరులు పాల్గొన్నారు.