25-06-2025 01:47:45 AM
కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 24 (విజయక్రాంతి): అసంపూర్తిగా ఉన్న కాటేదాన్ స్పోర్ట్ కాంప్లెక్స్ పనులను వేగవంతం చేసి, క్రీడాకారులకు అందుబాటులోకి తేవాలని జీహెఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం చార్మినా ర్ జోన్లోని పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కాటేదాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద స్విమ్మింగ్ పూల్కు వాటర్ కనెక్షన్ కోసం జలమండలి అధికారులకు కమిషనర్ ఫోన్ చేశారు. వాటర్ కనెక్షన్, షటిల్ బ్యాడ్మింటన్ ఆట స్థలాన్ని పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. పనులు పూర్తయిన వెంటనే వాటిని స్పోర్ట్స్ విభాగానికి అప్పగించాలని అధికారులను ఆదేశిం చారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ వెంకన్న, ఏసి స్పోర్ట్స్ యాదగిరిరావు, జోనల్ ఎస్సి మహేశ్వర్రెడ్డి, సిఈ రత్నాకర్, ప్రాజెక్ట్ ఈఈ కె.ఎల్ శ్రీనివాస్ ఉన్నారు.
జీహెఎంసీలో నేటి నుంచి క్రీడా సంబురాలు
జీహెఎంసీ బీట్ జర్నలిస్టులు, కార్పొరేటర్లు, జీహెఎంసీ ఉద్యోగుల కోసం ఈ నెల 25 నుంచి 30 వరకు ప్రత్యేక క్రీడాపోటీలను నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ విభాగం అడిషనల్ కమిషనర్ యాదగిరిరావు ప్రకటనలో తెలిపారు. చాదర్ఘాట్లోని విక్టరీ ప్లేగ్రౌండ్లో ఉదయం 8 గంటలకు ఈ సంబరాలను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రారంభిస్తారు. విక్టరీ ప్లేగ్రౌండ్లో కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ నాగోల్లోని ఫతుల్లగూడలోని డి.ఆర్.ఎఫ్ శిక్షణా కేంద్రంలో ఉదయం 10 గంటలకు ప్రారం భం అవుతాయని అడిషనల్ తెలిపారు.