పశువుల కొవ్వుతో నూనె తయారీ
02-06-2024 02:55 AM
ఇద్దరిపై కేసు నమోదు
గద్వాల (వనపర్తి), జూన్ 1 (విజయక్రాంతి): పశువుల కొవ్వుతో నూనె తయారు చేస్తున్న కేంద్రంపై పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అరెస్టు చేశారు. ఎస్సై విజయభాస్కర్ కథనం ప్రకారం.. గద్వాల జిల్లా అయిజ పట్టణానికి చెందిన అగ్గిరాముడు, అతని కూతురు శ్రావణితో కలిసి కొంతకాలంగా పశువుల ఎముకలు, కొవ్వుతో నూనె తయారు చేసి విక్రయిస్తున్నారు. ప్రతి ఆదివారం పశువులను వధించి, వాటి మాంసం విక్ర యించి.. మిగిలిన కొవ్వు, ఎముకలతో నూనె తయారుచేసేవారు. విషయాన్ని గమనించిన కాలనీ వా సులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. శనివా రం పోలీసులు నూనె తయారు చే స్తున్న కేంద్రంపై దాడులు నిర్వహించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు ఎస్సై తెలిపారు.






