భక్తజన సంద్రం కొండగట్టు
- అంజన్న క్షేత్రానికి కదిలిన కాషాయ దండు
హనుమయ్య దర్శానినికి
రెండు లక్షలకుపైగా భక్తులు
జగిత్యాల, జూన్ 1 (విజయక్రాంతి): రాష్ట్రంలోనే ప్రముఖ క్షేత్రం కొండగట్టు కాషాయమయమైంది. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా భక్తజన సంద్రమైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి హను మాన్ మాలధారణ చేసిన రెండు లక్షలకుపైగా భక్తులు వచ్చారు. శుక్రవారం రాత్రి నుంచే భక్తులు తరలిరావడంతో శనివారం ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. 41 రోజుల పాటు కఠోరదీక్ష పాటించిన భక్తులు ఇరుముడితో తరలివచ్చి కొండగట్టు అంజన్నను దరించుకొని పునీతులయ్యారు. జగిత్యాల కలెక్టర్ షేక్ యాస్మిన్బాషా పర్య వేక్షణలో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆధర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశా రు. శనివారం తెల్లవారుజామునే అర్చకులు అత్యంత వైభవంగా హనుమాన్ జయంత్యుత్సవాలను ఘనంగా నిరహించారు. తద నంతరం హనుమాను దీక్షపరులు దీక్ష విరమణ చేయించారు.






