17-06-2025 01:03:20 AM
నీట్లో షేక్పేట్ బ్రాంచీ టాపర్స్
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 16 (విజయక్రాంతి): నీట్ఱ ఫలితాల్లో ఆకాశ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులు సత్తా చాటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని షేక్పేట్ బ్రాంచి మేనేజర్ శ్రీధర్, అసిస్టెంట్ డైరెక్టర్ త్రిప్తి, ఇతర సిబ్బంది సోమవారం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. అందుకున్న వారిలో తేజేశ్వర్, కృష్ణమూర్తి, హంజా నిసార్ భాష, శరణ్య బసు, జనుంపల్లి సర్వాణి, బతూల్ సాజిద్, వైభవ్రెడ్డి, శ్రీహసిని చించోలి, కౌముది ఆచార్య, ముస్కన్ యాదవ్, ఫిదా జైనాబ్ వారు ఉన్నారు.
విద్యార్థులు మాట్లాడుతూ.. ఆకాష్ ఇనిస్టిట్యూట్ అధ్యాపకులు తమకు చాలా మంచి కోచింగ్ ఇవ్వడంతో పాటు వారి గైడ్లైన్స్ను తాము తూచా తప్పకుండా పాటించి ఉత్తమ ర్యాంకులు సాధించామని చెప్పారు. ఈ సందర్భంగా ఆకాష్ విద్యా సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. బ్రాంచి మేనేజర్ శ్రీధర్ మాట్లాడుతూ.. లాంగ్ టర్మ్ అడ్మిషన్లకు మొదలయ్యాయని, వివరాలకు 9866540606 నంబరులో సంప్రదించాలని తెలిపారు.