17-06-2025 01:05:24 AM
హైదరాడాద్ సిటీ బ్యూరో, జూన్ 16 (విజయక్రాంతి): హైదరాబాద్లోని శేరిలిం గం పల్లి మండలం ఖాజాగూడలో రూ.10 వేల కోట్లకు పైగా విలువైన 27 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని ఆరోపిస్తూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ పిల్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఖాజాగూడ సర్వే నం.119, 122లో ఉన్న 27 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే నంబర్లు మార్చి ఆక్రమించారని ఎమ్మెల్యేలు రాజేశ్రెడ్డి, చెన్నం శ్రీనివాస్రెడ్డి, మురళీనాయక్, అనిరుధ్రెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఆదేశించాలని అభ్యర్థించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది హైకోర్టుకు వాదనలు వినిపిస్తూ.. 2023లో రంగారెడ్డి కలెక్టర్ ‘నో అబ్జెక్షన్ లెటర్’ ఇవ్వడంతో జీహెఎంసీ భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందని తెలిపా రు. ప్రస్తుతం ఆ స్థలంలో 47 అంతస్తులు గల 8 టవర్లను నిర్మిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఇవన్నీ ఖాజాగూడ చెరువు ఫుల్ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉన్నాయని, ఇది నిబంధనల ఉల్లంఘన అని వా దించా రు. సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పిటిష నర్ల వాదనలు విన్న అనంతరం..
ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వా నికి, రెవెన్యూ కార్యదర్శికి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు, జీహెఎంసీకి, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.