27-06-2025 12:00:00 AM
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాం తి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30ను గడువుగా విధించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే రాష్ర్ట ప్రభుత్వం వెంటనే ఈ తీర్పు ప్రకారం 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో గురువారం మీడియా మాట్లాడుతూ.. ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మద్ద తు ప్రకటించారని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లు ఇచ్చే అధికారం, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే బాధ్యత రాష్ర్ట ప్రభుత్వానిదేనన్నా రు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243డీ ప్రకారం రాష్ర్ట ప్రభుత్వానికి అధికారం ఉందని, రాష్ర్ట ప్రభుత్వం ఈ అధికారాన్ని వినియోగించుకొని బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాం డ్ చేశారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకోవాలని కోరారు. కొందరు 50 శాతం సీలింగ్ పేరుతో సుప్రీంకోర్టు లేదా హైకోర్టు స్టే ఇస్తుందేమో అనే వాదనలు చేస్తున్నారని, ఇది పూర్తి గా తప్పుదారి పట్టించే గోబెల్స్ ప్రచారం మా త్రమేనని ఖండించారు. రాష్ర్ట ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ జనాభా లెక్కలు తేల్చిందని, ఆ లెక్కల ప్రకారం రాష్ర్టంలో బీసీ లు 42 శాతం కన్నా ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న అభిప్రాయంతో అసెంబ్లీలో చట్టం కూడా చేశారని, దీంతో న్యాయపరంగా ఎలాం టి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలన్నారు. అన్ని బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయని పేర్కొన్నారు.