27-06-2025 12:00:00 AM
సెయింట్ మేరీస్ సెంటెనరీ కాలేజీ ఆధ్వర్యంలో అవగాహన
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 26 (విజయక్రాంతి): సెయింట్ మేరీస్ సెంటెనరీ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఎస్ఎంసీసీఓఎం) గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. డ్రగ్స్ వినియోగంతో కలిగే ప్రమాదాలు, మాదకద్రవ్య రహిత సమాజం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కళాశాల ర్యాలీ, వ్యాస రచన, సమూహ చర్చలను నిర్వహించారు. ర్యాలీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ మీదుగా సాగింది. కాలేజీ డైరెక్టర్, ప్రిన్సిపాల్ రెవరెండ్ ఫాదర్ డాక్టర్ ఆంథోనీ వినయ్ మాట్లాడుతూ.. డ్రగ్స్కు ప్రతి ఒక్కరు దూరం గా ఉండాలని సూచించారు. ఆరోగ్యకరమైన, మరింత బాధ్యతాయుతమైన భవిష్యత్తు కోసం సమాజాన్ని ప్రేరేపించాలన్నారు.