12 May, 2026 | 11:39 PM

Breaking News

భధ్రాచలంలో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు   •   హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •  

సొంతింటి కల నెరవేర్చుతున్న ప్రజాపాలన ప్రభుత్వం

21-04-2026 03:15 AM

ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

చిన్న చింతకుంట ఏప్రిల్ 20: సొంతింటి కల నెరవేర్చుతున్న ప్రజాపాలన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమం కోసం అడుగులు వేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్ర పరిధిలోని లాల్ కోట, బండర్ పల్లి గ్రామాల్లో  ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి మధుసుదన్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఫర్దిపూర్ గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శివ కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే జియంఆర్ కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.