calender_icon.png 22 June, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రియల్ బూమ్ తగ్గలేదు

22-06-2025 12:43:04 AM

  1. కళ్లు తెరిచి చూస్తే వాస్తవాలు కనిపిస్తాయి 
  2. కొందరు దుష్ప్రచారం చేసినా గణాంకాలు అబద్ధం చెప్పవు 
  3. నిర్మాణరంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాం తి): రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిదంటూ కొందరు కావాలనే పనిగట్టుకొని తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తు న్నారని, అలాంటి వారు ఒక్కసారి కళ్లు తెరి చి చూస్తే వాస్తవాలు తెలుస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సూ చించారు. శనివారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో టైమ్స్ హోబ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్‌పో-2025ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగంలో 15.4 శాతం వృద్ధి రేటు నమోదైందని చెప్పారు. నిర్మాణ రం గం 11.97 శాతం వృద్ధి చెందిందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం రూ.80 వేల కోట్లు సమకూర్చిందని తెలిపారు. తెలంగాణ సర్వీసెస్ ఎకానమీలో ఈ రంగం వా టా 24.9 శాతమని పేర్కొన్నారు.

ప్రస్తుతం రెరా దగ్గర 9,744 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు రిజిస్టర్ అయ్యాయని, ఇవి కేవలం గణాంకాలు కాదు.. తమ హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నెమ్మదించిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి చెంపదెబ్బ అని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక్క హైదరాబాద్‌లోనే 5,900 ఇళ్ల రిజిస్ట్రేషన్ జరి గిందని, మొత్తం రిజిస్ట్రేషన్లలో రూ. కోటి, అంత కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల వాటా 18 శాతంగా ఉందన్నారు.

ఈ తరహా ఇళ్ల కొనుగోలులో వార్షిక వృద్ధి రేటు 58 శాతంగా నమోదైందని నైట్‌ఫ్రాంక్ నివేదిక వెల్లడిం చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని, తొలి దశలో 4.16 లక్షల ఇచ్చామని, ప్రతిఒక్కరూ తలెత్తుకుని గౌరవంగా జీవించాలనే సంకల్పంతోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్టు వెల్లడిం చారు.

రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తోన్న నిర్మాణ రంగం అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఎప్పటిక ప్పుడు సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ఈ రం గానికి అవసరమైన అత్యుత్తమ నైపు ణ్య మానవ వనరులను తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

‘ప్రభుత్వం మీ వెంట ఉంది. నిర్మాణ రంగ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవడా నికైనా సిద్ధంగా ఉంది. ఎలాంటి అ పోహలు పెట్టుకోవద్దు. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి’ అని ఈ వేదిక ద్వారా బిల్డర్లు, కొనుగోలుదారులకు స్పష్టం చేశారు. కార్యక్ర మంలో ఎమ్మెల్యేలు అరికపూడి గాం ధీ, గండ్ర సత్యనారాయణరావు, క్రెడాయ్ ప్రెసిడెంట్ జైదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.