22-06-2025 12:42:42 AM
- ఏపీలో బనకచర్ల పథకం పాపం వారిదే..
- బీఆర్ఎస్ హయాంలో నాటి ఏపీ సీఎం జగన్తో చీకటి ఒప్పందాలు
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): ఏపీ ప్రభుత్వం గోదావరిపై జలాల ఆధారంగా చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వ పాపమేనని, నాటి సీఎం కేసీఆర్, నాటి ఇరిగేషన్ మంత్రి హరీశ్రావు కలిసి తెలంగాణకు తీరని ద్రోహం చేశారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. తమ బాగోతం బయటపడుతుందనే, ఇప్పు డు హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లేందుకు యత్నిస్తున్నారని మండిప డ్డారు. హైదరాబాద్లోని సీఎల్పీ మీడియా సెంటర్లో శనివారం ప్రభుత్వ విప్ మీడియాతో మాట్లాడారు.
బచనచర్ల ప్రాజెక్ట్ సమస్యకు చర్చల ద్వారా పరిష్కారం కాకపోతే, తమ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందని స్పష్టం చేశారు. తమ ప్రభు త్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, దీనిలో భాగంగానే సీఎం రేవంత్ ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ను కలిసి అభ్యంతరాలు వ్యక్తం చేశామని గుర్తుచేశారు. నాటి సీఎం మొత్తం 3000 టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తుందని, పదే పదే ప్రకటించేవారని, ఇప్పుడు ఆ మిగులు జలాల ఆధారంగానే ఏపీ ప్రభుత్వం బనకచర్ల నిర్మిస్తున్నదని అభిప్రాయపడ్డారు.
కేసీఆర్, హరీశ్రావు ఇచ్చి న రూట్ మ్యాప్ తోనే ఏపీ ముందుకు వెళ్తున్నదని, ఏపీ గత ముఖ్యమంత్రి జగన్ను నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ నాలుగు సార్లు ప్రగతిభవన్కు పిలిపించుకున్నారని గుర్తుచేశారు. ఇద్దరూ కలిసి రాయలసీమను రతనాల సీమ చేస్తామని ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు. గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ నిర్మించే ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దని కోరుతున్నామని, అందులో తప్పేమిటో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని నిలదీ శారు.
కేసీఆర్, హరీశ్రావు గతంలో కృష్ణా జలాల్లో 299 టీఎంసీల జలాలు చాలని సంతకం చేసిన సంగతి వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అదే విషయాన్ని ఇప్పుడు కాం గ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని 405 టీఎంసీల జలాల వాటా రావాలని బీఆర్ఎస్ నేత లు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు ఏకంగా 500 టీఎంసీల వాటా కోసం కోట్లాడుతున్నారని, బీఆర్ఎస్ నేతలు ఎంత బుకాయించినా, వారి బండారం బయటపడిందని గుర్తుంచుకోవాలన్నారు.