15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

చెక్ డ్యామ్ కూలడానికి నాణ్యత లోపమే కారణం

18-12-2025 09:51 PM

ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్..

మంథని (విజయక్రాంతి): ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతోనే చెక్ డ్యామ్ కూలిపోయిందని ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్  సభ్యుడు దండు రమేష్ ఆరోపించారు. గత ప్రభుత్వ హయంలో 38 కోట్ల 82 లక్షల రూపాయల వ్యయంతో ఆడవి సోమన్ పల్లి దగ్గర మానేరుపై చెక్ డ్యాం నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అప్పట్లో చెక్ డ్యాం నిర్మాణ పనులపై సంబంధించిన ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారులు పనుల్లో నాణ్యత పాటించకపోవడం వల్లనే  తరచూ వరదల్లో కొట్టుకుపోతున్నాయన్నారు.

మానేరుపై 500 మీటర్ల పొడవుతో నిర్మాణం చేపట్టిన చెక్ డ్యామ్ పనుల్లో సైడ్ వాల్స్ అడుగు భాగంలో గుత్తేదార్లు బైండింగ్ మట్టి పోయకపోవడంతో, చెక్ డ్యామ్లకు ఇరువైపులా కరకట్టలు కట్టకపోవడంతోనే చెక్ డ్యాములు కూలిపోతున్నాయన్నారు. దీనిపై సంబందించి డీఈని అడిగితే ఎవరో బాంబులు పెట్టి పేల్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేయడం అసంబద్ధంగా ఉందన్నారు. చెక్ డ్యామ్ గోడ కూలిపోయిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో చిన్నతూండ్ల సర్పంచ్ గడ్డం క్రాంతి, కొయ్యురు సర్పంచ్ కొండ రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.