16-06-2025 08:16:42 AM
తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanam) సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. తిరుమలతో వెంకన్న సర్వదర్శనానికి(Srivari Sarva Darshan) భక్తులతో అన్ని కంపార్టు మెంట్లు నిండిపోయాయి. కంపార్టుమెంట్లన్నీ నిండి ఏటీజీహెచ్ క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న రికార్డు స్థాయిలో(90,815) భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 35,007 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించి మెక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.52 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు(TTD officials) ప్రకటించారు.