16-06-2025 02:09:31 AM
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): దినపత్రికకు ‘విజయక్రాంతి’ అనే రెవల్యూషనరీగా ఉందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యూర్షిప్శాఖ మంత్రి, రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ) నేత జయంత్ చౌదరి కితాబునిచ్చారు. ఆదివారం ఆయన అనేక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘విజయక్రాంతి’ దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజంను మర్యాద పూర్వకంగా కలిశారు.
కేంద్ర మంత్రి జయంత్ చౌదరిని సీఎల్ రాజం సత్కరించారు. ‘టెంపుల్స్ ఆఫ్ తెలంగాణ’ అనే పుస్తకాన్ని కేంద్రమంత్రికి బహూకరించి దినపత్రిక గురించి వివరించారు. పత్రిక ఆవిర్భావం, పయనం గురించి తెలుసుకున్న కేంద్ర మంత్రి హర్షం వ్యక్తం చేశారు. దినపత్రికకు ‘విజయక్రాంతి’ నామకరణం ఎంతో చైతన్యవంతంగా ఉందని, ప్రజల్లో స్ఫూర్తినింపే విధంగా ఉందని కితాబునిచ్చారు.