15 March, 2026 | 10:33 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

గంజాయి విక్రయించిన, సేవించిన కఠిన చర్యలు తప్పవు

09-10-2024 12:00 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): గ్రామాల్లో గంజాయి సాగుచేసిన, విక్రయించిన, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అఫ్జలొద్దీన్ హెచ్చరించారు. బుధవారం బెల్లంపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని నెన్నల మండలం నార్వాయిపేట గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా సిఐ గ్రామస్తులతో మాట్లాడారు. గంజాయికి అలవాటు పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఎక్కడైనా గంజాయి సాగుచేసిన, విక్రయించిన, సేవించిన సమాచారం తెలిస్తే పోలీసులకు తెలపాలన్నారు. అదేవిధంగా సైబర్ క్రైమ్, డయల్ 100, షీ టీమ్స్, గుడుంబా నిర్మూలన, మోటార్ వెహికల్ చట్టాలు, మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నెన్నల , తాళ్ల గురజాల, బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సైలు ప్రసాద్, రమేష్, మహేందర్ లతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.