15 March, 2026 | 9:14 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివి

09-10-2024 12:10 PM

గజ్వేల్ (విజయక్రాంతి): నిత్యం గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు ఎనలేనివని శ్రీగిరిపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి వేణు అన్నారు. బుధవారం దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం తరఫున పారిశుధ్య కార్మికులకు రెండు జతల చొప్పున దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలకు పారిశుధ్య సేవలో అందించడం ఎంతో ముఖ్యమైనదన్నారు. పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలకు వారిని ప్రజలంతా గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు కుమార్, వెంకట్, కరుణాకర్, అమరేందర్ రెడ్డి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.