23-06-2025 01:41:47 AM
పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి,మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ జూన్ 22 (విజయ క్రాంతి) : జ్యోతిబా పూలే, సావిత్రీబాయి పూలే దంపతుల చేసిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బోయపల్లిలో జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల నేటి యువత వారి గురించి తెలుసుకొని మంచి నడవడిక వైపు ముందుకు సాగేందుకు ఎంతో దోహదపడడం జరుగుతుందని తెలిపారు.
కాన్షిరాం,అంబేద్కర్ లాంటి వారు కూడా వెనుకబడిన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రయత్నించరని పేర్కొన్నారు. రిజర్వేషన్లు ఉండడం వల్లనే వెనుకబడిన వర్గాల వారు ఉన్నత శిఖరాలకు చేరుకోవటం ఎందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఎంతోమంది మహనీయులు ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేయడం జరిగిందని, వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని మన ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.