01-06-2025 12:06:51 AM
- కవాడిగూడ కార్పొరేటర్ రచన శ్రీ
ముషీరాబాద్, మే 31 (విజయక్రాంతి): స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయమని కవాడిగూడ కార్పొరేటర్ జి. రచన శ్రీ అన్నారు. ఈ మేరకు శనివారం అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కవడిగూడ డివిజన్ లో బండ నగర్ కమ్యూనిటీ హల్ లో వేసవి శిక్షణ శిబిరాలు ముగింపు కార్యక్రమం జరిగినది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కవడిగూడ డివిజన్ కార్పొరేటర్ రచన శ్రీ మాట్లాడారు. అప్స, సర్వ్ నీడ్ ల స్వచంద సంస్థలు పెద, మధ్య తరగతి వారికి చేస్తున్న సేవలు కార్యక్రమాలు అభినందనీయం అన్నారు. వేసవి కాలంలో పిల్లల లోని నైపుణ్యతను వెలికితీయడానికి ఈలాంటి కార్యక్రమాలు నిర్వహించద్వారా చెడు వ్యాసనాలకు దూరంగా ఉండటమే కాకుండా మొబైల్ వంటి వంటి వాటికి బానిస కాకుండా ఉండడం చేయడం సంతోషమన్నారు. ప్రతి ఒక్కరు మంచిగా చదువుకొని ముందు తరాలకు ఆదర్శంగా ఉండాలని అన్నారు.
హిమాయత్ నగర్ సబ్ పోస్ట్ మాస్టర్ సురేష్ గౌడ్ మాట్లాడుతూ అప్స, సర్వ్ నీడ్ స్వచంద సంస్థ వివిధ దాతల ద్వారా పేదలను ఆదుకునేందుకు ముందుకు రావడమే కాకుండా, వీరికి వివిధ అంశాల పై అవగాన చేయడం అభినందనీయం అన్నారు. అనంతరం వేసవి శిక్షణ శిబిరాలు పాల్గొన్న వారికి దాతల ద్వారా టిఫిన్ బాక్సులు, బహుమతులు అంద జేశారు. ఈ కార్యక్రమంలో అప్స స్వచ్ఛంద సంస్థ సీనియర్ కో ఆర్డినేటర్ బొట్టు రమేష్, అప్స సంస్థ ప్రతి నిధులు శ్రావణి లావణ్య, మంగ బీజేపీ నాయకులు వెంకటేష్, కుమార్ గౌడ్, పాల్గొన్నారు.