07-05-2025 12:00:00 AM
నాగార్జునసాగర్, మే 6 (విజయక్రాంతి) : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన పడకేసింది. పాలక వర్గాల గడువు ముగియడంతో .. నల్లగొండ జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక అధికారుల బాధ్యతలను అప్పగించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు, త్రిపురారం, నిడుమనూరు, తిరుమలగిరి (సాగర్), పెద్దవూర మండలాల్లో పంచాయితీల్లో, ప్రత్యేక అధికారుల పాలనతో కొత్త చిక్కులు తప్పడం లేదు.
అసలే ఉన్న సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న గ్రామాల్లో .. జిల్లా అధికారికి రెండు, మూడు పంచాయితీల నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతో... వారు చుట్టపు చూపుగానే పల్లెల్లో పర్యటనలు చేస్తున్నారు. దీంతో పల్లెల్లో సమస్యల చిట్టా అంతకంతకూ పేరుకుపోతుంది. ప్రజలు ఇక్కట్లు పడుతుంటే ..ప్రత్యేక పాలనలో నెట్టుకొస్తున్నారు.
పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన పడకేసింది. ఒక్కో అధికారికి మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలను అప్పగించడం, వారు గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడని నిర్లక్ష్యం పట్ల పంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ కోరప డడంతో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు.
పల్లెల్లో ప్రత్యేకాధి కారుల పాలన పడకేసింది. ఒక్కో అధికారికి మూడు, నాలు గు పంచాయతీల బాధ్యతలను అప్పగించడం, వారు చుట్టపు చూపుగా గ్రామాలకు రావడంతో పంచాయతీల పాలన అస్తవ్యస్థంగా మారిపోయింది. మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీలు, చేతిపంపులు మరమ్మతులకు నోచుకోకపోవడం, పారిశుధ్యంపై పర్యవేక్షణ కొరవడడంతో సమస్యలతో సతమతమవుతున్నారు.
ఐదు నెలలుగా ఈ ఏడాది జనవరి నెలాఖరునాటికి సర్పంచుల పదవీ కాలం ముగిసింది. దీంతో పంచాయతీల పాలనావ్యవహారా లను చూసేందుకు ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమిం చింది. ప్రత్యేకాధికారుల పాలన మొదలై అయిదు నెలలవు తోంది.
నిధులు లేమికి తోడు అదనపు బాధ్యతలు...
శాఖారపరమైన కాకుండా గ్రామాల ప్రత్యేక అధికారుల అదనపు బాధ్యతలు అప్పగించడంతో సదరు అధికారులు పల్లెలను పెద్దగా పట్టించుకోవడం లేదు. నామమాత్రంగానే పల్లెల ముఖం చూడడం లేదు. దీంతో పంచాయతీల్లో పర్యవేక్షణ కొ రవడింది. ఫలితంగా స్థానికంగా పంచాయతీ కార్యదర్శు లపైనే మొత్తం భారం పడుతున్నది. అభివృద్ధి పనులు పడకే శాయి. మరమ్మతులు అటకెక్కాయి.
ప్రత్యేకాధికారుల పాలన కు ముందు పంచాయతీ ఖాతాల్లోని నిధులను సర్పంచులు వాడేసుకున్నారు. ఇప్పుడు పంచాయతీల ఖాతాల్లో ఒక్క పైసా కూడా లేదు. రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కొన్ని నెలలుగా నిధులు జమకావడం లేదు. దీంతో పంచాయతీల పాలన మొక్కుబడిగా సాగుతోం ది. పారిశుధ్య పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదు.
గతంలో చేపట్టిన పలు పనులకే నెలల తరబడి బిల్లులు పెండింగ్లో ఉండడటంతో కొత్త పనులు చేపట్టే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుత వర్షాకాలంలో గ్రామాల్లో పారి శుధ్యం మెరుగుపడకపోతే ప్రజలు జబ్బుల బారిన పడే అ వకాశం ఉంది. ఇప్పటికే గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలు తున్నాయి. డెంగీ కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. పారిశుధ్య చర్యలు చర్యలు తీసుకోకపోతే పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉందని గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమస్యల చిట్టా.. పర్యవేక్షణ ?
ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గ్రామాల్లో ఎక్కడిక్కడ సమస్యలు పేరుకుపోతున్నాయి. ఎక్కువ గ్రామాల్లో చెత్త పేరుకుపోతుంది. పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మిషన్ భగీరథ పైపులైన్లు చాలా చోట్ల లీకై సక్రమంగా సరఫరా జరగడం లేదు. గ్రామాల్లో స్ట్రీట్ లైట్లు పాడై పోయినా పట్టించుకోవడం లేదని,కనీసం వాటిని బాగు చేయించే నాధుడే లేకుండా పోయారని పంచాయతీలను ప్రత్యేకాధికారులు పట్టించుకోక పోవడంతో అనేక గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
మిషన్ భగీరథ పైప్లైన్లు చాలా చోట్ల లీకై నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదు, పాడైన బోర్లను బాగు చేయించేవారు కరవయ్యారు. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. హరితహారం మొక్కలు ఎండిపోతున్నాయి. నర్సరీల సంరక్షణ సరిగా జరగడం లేదు. రాష్ర్ట ఆర్థిక సంఘం నిధులు దాదాపు 14 నెలలుగా పెండింగ్లో ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం నిధులు రెండు నెలలకోసారి మంజూరవు తున్నా సరిపోక పంచాయతీలకు ఇక్కట్టు తప్పడం లేదు. పాలరవర్గం ఉన్న సమయంలో అప్పోసప్పో చేసి గ్రామాల అభివృద్ధికి సర్పంచులు పూనుకునే వారు. బిల్లులు మంజూరైనప్పుడు తీసుకునేవారు. ఇప్పుడు పంచాయతీల్లో నిధుల లేమితో ప్రత్యేకా ధికారులు పట్టించుకోవడం లేదు.
నిధులకు కటకట..
గ్రామ పంచాయతీలు నిధుల కటకటను తీవ్రం గా ఎదుర్కొంటున్నాయి. ఖాతాల్లో డబ్బులు లేక, అ త్యవసర పనులకు ఖర్చు చేయలేక సతమతమవు తున్నాయి. పారిశుధ్య కార్మికుల జీతాలు, పైపుల లీ కేజీ మరమ్మతు, బోర్ల మరమ్మతు పనులు, పంచా యతీ ట్రాక్టర్ నెలవారీ బ్యాంకు వాయిదా, గ్రామా ల్లో విద్యుత్ దీపాలు, నెలనెలా విద్యుత్ బకాయిలు.. ఇవన్నీ కచ్చితంగా చెల్లించాల్సిందే.
నిధుల లేకపో వడంతో ఈ బరువు బాధ్యతల గురించి ప్రత్యేకాధికా రులు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గామ కార్యదర్శులే ఎలాగోలా కార్మికులకు జీతాలు సర్దుబా టు చేస్తున్నారు. ఇప్పటికే ఒక్కో గ్రామపంచాయతీ రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు అప్పు చేసి చెల్లి స్తున్నారు. పంచాయతీల ప్రత్యేకాధికారులు ఖర్చు విషయంలో లెత్తేస్తుండడంతో భారమంతా కార్యద ర్శులపైనే పడుతోంది.
నాలుగు రోజులు ఉండిపోయే వాళ్లమని ప్రత్యేకాధిరులు దాటవేత ధోరణిని అను సరిస్తున్నారు.తాము గ్రామాలకు ప్రత్యేకాధికారులం అని చెప్పి అటు గ్రామాలకు వెళ్లడం లేదు. ఇటు వారి సొంత శాఖలో డ్యూటీలు నిర్వహించడం లేదు. పూర్తిగా ఉద్యోగ బాధ్యతలను వదిలి సొంత వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
నెలనెలా ప్రభుత్వ వేతనం తీసుకుంటూ తమ ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తలేరనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాలక్షేపం, సొంత వ్యాపారాలకే ప్రభుత్వ ఉద్యోగులు పరిమితం అవుతున్నారన్న విమర్శలు నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా బలంగా వినిపిస్తున్నాయి. ఆఫీసు సమయంలో సైతం చాలామంది అధికారులు కార్యాలయాల్లో ఉండడం లేదని తెలిసింది.
తీసుకునేది ప్రభుత్వ జీతం చేసేది ప్రైవేట్ వ్యాపారాలు ఇది ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల తీరు ఉంది. గ్రామాలకు నియమించిన ప్రత్యేకాధికారులు రాకపోవడంతో ఆ భారమంతా పంచాయతీ కార్యదర్శులు మీదనే పడుతున్నది. దీనికితోడు ప్రత్యేక అధికారుల పాలనలో రాజకీయ జోక్యం మితిమీరిపోయింది.
గ్రామాలకు మంజూరైన పనుల్లో రాజకీయ పార్టీల నాయకుల జోక్యం పెరిగింది. ఆయా పనుల కు సంబంధించి ఒత్తిళ్లు తప్పపోవడంతో అధికారులు మిన్నకుండిపోతున్నారు. గ్రామాల్లో పడకేసిన ప్రత్యేక పాలనను గాడిన పెడుతుందా..? లేదా..? వేచి చూడాలి మరీ..