08-06-2025 12:31:44 AM
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): ‘బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటైన మంత్రివర్గ సబ్కమిటీ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న నీటి ప్రాజెక్ట్లకు సంబంధించినది. ఆ సబ్ కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎలాంటి సంబంధం లేదు. ఇటీవల జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సబ్కమిటీ ఆమో దం మేరకే కాళేశ్వరం నిర్మాణం జరిగిందని ఎందుకు చెప్పారో తెలియడం లేదు.
ఈటల వాంగ్మూలం అసత్యాలతో కూడుకున్నది. అవన్నీ వాస్తవానికి దూరంగా ఉన్నాయి. ఈటల అనాలోచింతంగా వాంగ్మూలం ఇచ్చారా? లేదంటే ఆ రకంగా వాంగ్మూలం ఇవ్వాల్సిన పరిస్థితులేమైనా దాపురించా యా.. అనేది తెలియడం లేదు. నేను సుమోటోగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందుకు వెళ్తానని, ఇతర వివరాలన్నీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తా’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తేల్చిచెప్పా రు.
హైదరాబాద్లోని సచివాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల పీసీ ఘోష్ కమిషన్ ఎదుట బహిరంగ విచారణకు హాజరై, ఆ తర్వాత బయటకొచ్చి ఈటల రాజేందర్ ఇచ్చిన వివరణపై మంత్రి స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాళేశ్వరం పరిధిలోని మేడిగడ్ద బరాజ్కి అనుమ తులు వచ్చాక 15 రోజులకు, రాష్ట్రంలో పెం డింగ్ ప్రాజెక్టులపై సబ్ కమిటీని ఏర్పాటైందని గుర్తుచేసుకున్నారు.
‘పెండింగ్ ప్రాజె క్టులను కాంట్రాక్టర్లు ముందు నిర్దేశించుకున్న అంచనాలోపే పనులు పూర్తి చేస్తారా? ఒకవేళ పనులు పూర్తి కాకుంటే ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవాలి’ అనే అంశంపై అధ్యయనం కోసమే నాడు సబ్కమిటీ ఏర్పా టైందని వెల్లడించారు. ఈ సబ్కమిటీ కాళేశ్వరం నిర్మాణానికి ఎలాంటి అనుమతలు ఇవ్వలేదని, అలాగే ప్రాజెక్టుపై సబ్కమిటీ ఎనాడూ నివేదిక ఇవ్వలేదని స్పష్టం చేశారు.
సబ్కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నందుకే తనను బాధ్యుడిని చేసే కుట్ర జరుగుతున్నదని వాపోయారు. ఈటల వ్యాఖ్యలను తన ను ఒకింత బాధకు గురిచేశాయని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగుబాటుకు గురైందన్న సంగతి వాస్తవమని, అయినప్పటికీ బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఇప్పటికీ మీడియా ముఖంగా అసత్యాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఒక్క పనైనా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరగలేదని స్పష్టం చేశారు.