05-06-2025 08:20:42 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ(Sri Venugopalaswamy Temple) విమాన గోపురంపై భక్తుల జయజయ ధ్వానాల మధ్య గురువారం సుదర్శన చక్ర పునః ప్రతిష్టోత్సవ కార్యక్రమం వేదపండితుల మంత్రోచ్చారణల అంగరంగ వైభవంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు సుదర్శన చక్ర పునః ప్రతిష్టాపన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫ్రధాన అర్చకులు ముడుంబై లక్ష్మీ నారాయణాచార్యుల నేతృత్వంలో వేదపండితుల మంత్రోచ్చారణలతో గురువారం తెల్లవారుజాము నుంచే ప్రతిష్టాపన కార్యక్రమాలు ఆరంభమయ్యాయి.
మాల మంత్రహవనములు, మహాపూర్ణాహుతి, శిఖర పునః ప్రతిష్ఠ, కుంభాభిషేకము, మూర్తి ఆరాధన, నివేధనలతో పాటు భక్తులకు మంగళా శాసనాలు, వేద ఆశీర్వాదం, భక్తులకు తీర్థ ప్రసాదాలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యజ్ఞికులు శ్రీమాన్ ఉత్పల కృష్ణ మాచార్యులు, ఆలయ పూజారి గౌతమ్ పురోహిత్, వేదపండితులు గౌతమ్, దత్తు, నిర్వాహకులు చాపల ఉషా బాపురెడ్డి, మొగిలి ప్రసాద్ రెడ్డి, సింగం మనోహర్, కొల్లూరి రవికుమార్, బోనగిరి గిరిధర్ గుప్తా, మేక ప్రవీణ్ రెడ్డి, పరకాల నరేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బవిరిశెట్టి శ్రీనివాస్, కైరంకొండ లలిత, ఖలీల్, గాంతి మధుసూదన్ రెడ్డి, మొగిలి మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.