15 March, 2026 | 8:06 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

సాంకేతిక సమస్య తొలగించి రైతులకు రుణమాఫీ చేయాలి

16-04-2025 06:14 PM

అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఎమ్మెల్యే విజ్ఞప్తి...

మహబూబాబాద్ (విజయక్రాంతి): సాంకేతిక కారణాలతో రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ కానీ రైతులకు సాంకేతిక సమస్యలు తొలగించి రుణమాఫీ పథకం అమలు చేయాలని, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Murali Naik Bhukya) రైతుల వివరాలతో కూడిన నివేదికతో వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావుకు విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో సుమారు పదివేల మంది రైతులు 2 లక్షల లోపు రుణమాఫీ కాకుండా మిగిలిపోయారని చెప్పారు.

బ్యాంకుల్లో రైతుల ఖాతాలకు సంబంధించి సాంకేతిక సమస్యలు ఉన్నాయని వీటిని పరిష్కరిస్తే రైతులకు రుణమాఫీ పథకం అమలు జరుగుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ప్రిన్సిపల్ సెక్రెటరీ ఈనెల 21న జరగనున్న బ్యాంకర్ల సమావేశంలో మహబూబాబాద్ నియోజకవర్గ రైతుల రుణమాఫీ అంశాన్ని పరిశీలించి, అర్హులైన రైతులకు రుణమాఫీ జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే చెప్పారు.