22-01-2026 12:07:05 AM
మార్కండేయుడి ఆశీస్సులు ఉండాలి
బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, జనవరి 21 (విజయక్రాంతి): మార్కండేయుడి ఆశీస్సులతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ, పట్టణం, కుటుంబాలు బాగుండాలని బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకాక్షించారు. సిరిసిల్లలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శివభక్త మార్కండేయ జయంతిని పురస్కరించుకుని బుధవారం హోమం నిర్వహించారు. ఈ వేడుకలకు కేటీఆర్ హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేసి పద్మశాలీలతో కలిసి మార్కండేయ స్వామి శోభయాత్రలో పాల్గొన్నారు. నేతన్న చౌక్ లో నేతన్న విగ్రహానికి కేటీఆర్ పూలమాలు వేశారు.
కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పాల్గొన్నారు.