calender_icon.png 23 September, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలత్రిపుర సుందరిదేవి అలంకరణలో ముగ్గురమ్మలు

23-09-2025 12:36:13 AM

వలిగొండ, సెప్టెంబర్ 22 (విజయ క్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ విద్యాపురంలో గల త్రిశక్తి క్షేత్రంలో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రి  ఉత్సవాల్లో  భాగంగా మొదటి రోజు అమ్మవార్లు బాలా త్రిపుర సుందరిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి  అమ్మవార్లను గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించి  ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేద సంస్కృతి పరిషత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.