calender_icon.png 30 May, 2025 | 9:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహుముఖ ప్రజ్ఞానిధి సురవరం ప్రతాపరెడ్డి

29-05-2025 12:29:47 AM

- తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి

- అక్షర జ్యోతిని వ్యాపింపజేసిన సురవరం ప్రతాపరెడ్డి

- అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి

ముషీరాబాద్, మే 28 (విజయక్రాంతి): రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో తెలంగాణను మేల్కొల్పి, తెలుగు ప్రజానీకాన్ని జాగృతం చేసిన బహుముఖ ప్రజ్ఞాని ధి సురవరం ప్రతాపరెడ్డి అని తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు, సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివా రెడ్డి తెలిపారు.

సురవరం ప్రతాపరెడ్డి 129వ జయంతి సందర్బంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఉన్న అయన విగ్రహానికి బుధవారం ఆచా ర్య ఎల్లూరి శివా రెడ్డి, ట్రస్ట్ కార్యదర్శి సురవరం పుష్పలత, తెలంగాణ సారస్వత పరిష త్తు ప్రధాన కార్యదర్శి, ట్రస్ట్ సంయుక్త కార్యదర్శి జె. చెన్నయ్య, ట్రస్ట్ సభ్యులు, సురవరం కుటుంబసభ్యులు ఫూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడు గా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగి న ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి అని ఆయన పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన గ్రంథం ౠఆంధ్రుల సాంఘిక చరిత్ర’ తెలుగు ప్రజల చరిత్ర తెలి పే మహద్గ్రంధం అని,ఈ గ్రంథం తెలుగువారి వేయి సంవత్సరాల సాంఘిక, కళా సాంస్కృతిక చరిత్ర వివరిస్తుందని అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతా పరెడ్డి పేరును పెట్టడం అభినందనీయమని ఆచార్య ఎల్లూ రి శివారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు డా. సురవరం కృష్ణవర్ధన్ రెడ్డి, కొండా లక్ష్మికాంత్ రెడ్డి, సురవరం రఘువర్దన్‌రెడ్డి, సురవరం విజయభాస్కర్‌రెడ్డి,  డా. సురవరం రంగారెడ్డి, కుటుం బసభ్యులు సురవరం అనిల్ కుమార్ రెడ్డి, సురవరం కపిల్ తదితరులు పాల్గొన్నారు.

భావి తరాలవారికి ఆదర్శంగా నిలిచిన మహనీయుడు సురవరం

నిజాం నిరంకుశ పాలనలో ఉర్దూ భాషా రాజ్యమేలుతున్న రోజుల్లో తెలంగాణలో తెలుగు అక్షర జ్యోతిని వ్యాపింపజేసిన ఘనత సురవరం ప్రతాపరెడ్డిదేనని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణ వైతాళికుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి 129వ జయంతి సందర్భంగా బుధవారం ట్యాంక్ బండ్ పై గల సురవరం విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతాపరెడ్డి రచయితగా, పండితుడిగా, చరిత్ర పరిశోధకుడిగా, పత్రికా సంపాదకుడిగా, స్వాతంత్య్ర ఉద్యమకారుడిగా, సామాజిక కార్యకర్తగా అన్ని రంగాల లో తనదైన ప్రత్యేక ముద్రను వేసి భావి తరాలవారికి ఆదర్శంగా నిలిచాడని తెలిపారు.

ఆనాటి హైదరాబాద్ కొత్వాల్ రాజా బహదూర్ వెంకటరామారెడ్డి కోరిక మేరకు రెడ్డి హాస్టల్ కు సురవరం చాల కాలం సేవలందించాడని, ఆ సమయంలో ఉన్న విద్యా ర్థులందరిలోను దేశభక్తి భావాలను పెంపొందించి, సామాజిక పరంగా, రాజకీయంగా, సంఘంలో ఉన్న దుస్థితులను, ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రజల అవస్థలను కళ్ళారా చూసిన సురవరం ప్రజల్లో చైతన్యం కలిగించే దిశగా గోలకొండ పత్రికను స్థాపించి అనేక స్ఫూర్తివంతమైన, ఉత్తేజపూర్తిమైన సంపాదకీయా లు రచించి, తెలంగాణాలో భాషాభిమానాన్ని, ఉద్యమ స్ఫూర్తిని, సామాజిక చైతన్యాన్ని, రాజకీయ స్థిరతను సాదించేందుకు సురవరం బాటలు వేశారని ఆయన తెలిపారు.