calender_icon.png 12 October, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాజాలో ముగిసిన యుద్ధం!

11-10-2025 12:00:00 AM

  1. ఆ దేశం నుంచి పాక్షికంగా బలగాలను ఉపసంహరించుకున్న ఇజ్రాయెల్
  2. అమలులోకి కాల్పుల విరమణ ఒప్పందం 

జెరుసలేం, అక్టోబర్ 10: రెండేళ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్- -హమాస్ యుద్ధానికి ఎట్టకేలకు తెరపడింది. తాజాగా ఇజ్రాయెల్ -హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పం దం అమలులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ ప్రతిపాదించిన తొలి దశ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్- పాలస్తీనా తీవ్రవాద గ్రూపు హమాస్ గురువారం సంతకాలు చేసిన విషయం తెలిసిందే.

ఈ నే పథ్యంలో తాజాగా ఇజ్రాయెల్- హమాస్ మ ధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చింది.ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ర క్షణ దళాలు శుక్రవారం ప్రకటించాయి. కా ల్పుల విరమణ ఒప్పందం అమలులోకి రావడంతో గాజాలో యుద్ధం ముగిసిందం టూ వెల్లడించాయి. గాజా నుంచి ఇజ్రాయెల్ తన బలగాలను పాక్షికంగా ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. ఇరు పక్షాలు బందీలను విడుదల చేసేందుకు సన్నాహకాలు ప్రారంభించాయి.

రెండేళ్ల క్రితం ఇజ్రాయ్పె హమాస్ అనూహ్య దాడితో యుద్ధం మొదలైన సంగతి తెలిసిం దే. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయ్పె హమాస్ మెరుపు దాడికి దిగింది. దాదాపు 1,200 మందిని హతమార్చి, 250 మందికిపైగా బందీలుగా చేసుకుంది. హమాస్ దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో 67వేలకు మందికిపైగా పాలస్తీనా పౌరులు మరణించారు.

ఇజ్రాయెల్ దాడుల్లో వేలాది ఇళ్లు నేలమట్టం కాగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులై టెంట్లలో తలదాచుకుని జీవిస్తున్నారు. వేలాదిమంది ఆకలిదప్పులతో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ ముందుకొచ్చారు. ఈ మేరకు గాజాలో శాంతికి 20 సూత్రాల శాంతి ప్రణాళికను సూచించారు. ఇందుకు ఇజ్రాయెల్-హమాస్ అంగీకరించడంతో యుద్ధం ముగింపుకు తొలి అడుగు పడింది.