సంక్షేమ వసతి గృహాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలి
07-02-2026 01:35 AM
కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, ఫిబ్రవరి 6(విజయ క్రాంతి) :సం క్షేమ వసతి గృహాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందు లు కలుగకుండా చూడాలని కలెక్టర్ రాహు ల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలో సంక్షేమ బా లుర వసతి గృహాన్ని ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వసతి గృహాల్లో గదులను, వంటలను పరిశీలించారు. విద్యా బోధన, హాస్టల్ పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యల గురుంచి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి విద్యార్థుల నైపుణ్యాల ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వి ద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూ సుకోవాలని, వసతి గృహాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావా లన్నారు.






