26-05-2025 11:38:33 PM
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..
ఉట్నూర్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bhojju Patel) పేర్కొన్నారు. ఉట్నూర్ మండలంలోని బిర్సాయిపేట గ్రామంలో రూ.18 లక్షలు, దంతనపల్లి గ్రామంలో రూ.25 లక్షల వ్యయంతో చేపడుతున్న చెరువుల మరమ్మత్తుల పనులకు సోమవారం ఎమ్మెల్యే భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు సాగు చేస్తున్న పంట పొలాలకు సాగునీరు అందించేందుకు చెరువులు ఎంతో గానో ఉపయోగపడతాయని అన్నారు. రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.