27-05-2025 12:00:00 AM
కల్లూరు, మే 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం వంటివి పధకాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులు కి ప్రభుత్వం ఉద్యోగాలు ఉన్న వారికీ ఇస్తు న్నారని,నిజమైన అర్హులకు పథకాలు అందని ద్రాక్ష లాగే ఉన్నాయని భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఈవి రమేష్ లు ధ్వజమెత్తారు.
సోమవారం కల్లూరు ఆర్డీవో కార్యాలయం లో ఆర్డీవోను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన అర్హత ప్రమాణాలు కనీసం పాటించ లేదని, నిజమైన అర్హులకు మొండి చేయి చూపుతున్మారని, నియోజకవర్గ వ్యా ప్తంగా మంజూరైన 3,500 ఇందిరమ్మ ఇండ్లను నిజమైన అర్హులకు మాత్రమే అందజేయాలని డిమాండ్ చేశారు.
వికలాంగులు,వితంతువులు ఎంత మంది కి ప్రాధాన్యత ఇచ్చారో జాబితా విడుదల చేయాలన్నారు.అర్హులకు అన్యాయం జరిగితే వారితో కలిసి నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ భాస్కర్ణి వీరంరాజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు లు జొన్నలగడ్డ నరేష్ కల్లూరు మండల అధ్యక్షులు గుమ్మా రామకృష్ణ,సాలి శివకృష్ణ, చల్లా నాగులు, బొర్రా నరసింహారావు, పర్సా రాంబాబు, చాలా అప్పారావు, పానుగంటి కృష్ణయ్య, మండవ వెంకట రామిరెడ్డి,రంగు రవి, పాల్గొన్నారు.