calender_icon.png 2 June, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల పన్నులను పొందినప్పుడే మనం చేసిన ఉద్యోగానికి సార్థకత ఏర్పడుతుంది

31-05-2025 11:06:57 PM

ఐటిడిఏ పిఓ రాహుల్..

భద్రాచలం (విజయక్రాంతి): ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ అనేది తప్పనిసరి అని కానీ తాను చేస్తున్న ఉద్యోగానికే కానీ జీవితానికి కాదని, ప్రతి ఒక్క ఉద్యోగి ఉద్యోగంలో చేరినప్పుడే రిటైర్మెంట్ అనేది అనివార్యమని, ఉద్యోగం చేసినన్ని రోజులు తన విధులు సక్రమంగా నిర్వహించి ప్రజల చేత, పై అధికారుల చేత మన్ననలు పొందినప్పుడే తను చేసిన ఉద్యోగానికి, జీవితానికి సార్ధకత లభిస్తుందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్(ITDA Project Officer B. Rahul) అన్నారు. శనివారం ఐటిడిఏ సమావేశం మందిరంలో మే 31 నాడు ఉద్యోగ పదవీ విరమణ పొందుతున్న ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్, ఏసీఎంవో రమణయ్య, ఉద్యానవన శాఖ కార్యాలయం మాలి బాబురావు సన్మాన ఉత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జీవితంలో చిన్నతనంలో పుట్టినరోజు నుండి మొదలుకొని ఊహ తెలిసిన తర్వాత పై చదువులు చదివి ఉద్యోగ అన్వేషణలో తిరిగినప్పుడు అలాగే ఉద్యోగం వచ్చే రోజు ఉన్న ఆనందం, ఉద్యోగ నిర్వహణలో తన అనుభవాలు నెమరు వేసుకొని, పదవి విరమణ చేసినప్పుడు అందరితో ఆనందాన్ని పంచుకోవడం గొప్ప అనుభూతి ఇస్తుందని ఆయన అన్నారు. ఈఈ చంద్రశేఖర్ వెల్ఫేర్ 41 సంవత్సరాలు, ఏసీఎంవో రమణయ్య 39 సంవత్సరాలు, మాలి బాబురావు 40 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి, అంచలంచెలుగా ఎదిగి తన ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వహించి  మంచి పేరు తెచ్చుకున్నారని ఆయన అన్నారు.

ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి ఉద్యోగ విరమణ పొందడం బాధాకరమైన, ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి శాశ్వతం కాదని తప్పనిసరిగా రిటైర్మెంట్ తప్పదని, తన శేష జీవితాన్ని తన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని, అలాగే తాను చేసిన కార్యాలయాలలో సిబ్బందికి వారి విధుల పట్ల ఏమైనా సమస్యలు వస్తే తన సహాయ, సహకారాలు అందించాలని, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్ గిరిజన గ్రామాలలో ఇంజనీరింగ్ పనుల విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే సేవలు తప్పనిసరిగా అందజేయాలని, ఏ సి ఎం ఓ రమణయ్య మేము త్వరలో పెద్ద ఎత్తున కల్చరల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నామని అందుకు తప్పనిసరిగా సహకారం అందించాలని ఆయన అన్నారు. 

అనంతరం ఉద్యోగ పదవి విరమణ పొందుతున్న ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్ 1984 సంవత్సరంలో ఇంజనీర్ విభాగంలో సూపర్వైజర్ గా పాల్వంచ ఐ టి డి ఏ లో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారని, ఏసీఎంఓ రమణయ్య 1986లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో సెక్టరల్ అధికారిగా పులిగుండాలలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారని, మాలి 1985 సంవత్సరంలో ఐటీడీఏ ఉద్యానవనంలో మాలిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించామని ఇప్పటివరకు మా యొక్క విధులు సక్రమంగా నిర్వహించామని, ఇన్ని సంవత్సరాల సర్వీసులో మాకు సహకరించిన అధికారులు, నాతోటి సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని, నాతోటి సిబ్బందికి ఏమైనా ఉద్యోగ పరంగా సమస్యలు ఉంటే తప్పకుండా మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నామని వారు అన్నారు.  

అనంతరం ఉద్యోగ విరమణ పొందుతున్న ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్, ఏ సి ఎం ఓ రమణయ్య, మాలి బాబురావు దంపతులను ఐటీడీఏ పీవో, సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఆర్సిఓ గురుకులం అరుణ కుమారి, ఏవో సున్నం రాంబాబు, ఐటీడీఏ యూనిట్ అధికారులు, ఏ టి డి ఓలు అశోక్ కుమార్, చంద్రమోహన్, రాధమ్మ,మేనేజర్ ఆదినారాయణ,ఐటీడీఏలోని వివిధ విభాగాల పర్యవేక్షకులు ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.