calender_icon.png 2 June, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దయాది దాడిలో దంపతులకు తీవ్ర గాయాలు

31-05-2025 11:09:34 PM

పరిస్థితి విషమం..

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): భూ తగాదాల నేపథ్యంలో ఇద్దరు వృద్ధ దంపతులపై దాయాది గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District) తాడూరు మండలం ఐతోల్ గ్రామంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులు బాధితులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డి(62), తిరుపతమ్మ(56) దంపతులు ఇరువురు శనివారం తమ పొలంలో పంట విత్తనాలు నాటేందుకు భూమి చదును చేస్తుండగా అదే గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే తమ దయాది గొడ్డలితో తీవ్రంగా గాయపరిచాడు.

విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఇరువురినీ హైదరాబాద్ తరలించినట్లు తెలిపారు. కాగా విషయంపై పోలీసులు ఘటనస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గురుస్వామి తెలిపారు. భూ తగాదాలు చాలా కాలంగా ఉన్న నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు.