31-05-2025 11:02:21 PM
గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి..
నాగల్ గిద్ద (విజయక్రాంతి): నాగల్ గిద్ద మండల పరిధిలోని కారస్ గుత్తి గ్రామంలోని సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి(MLA Dr. Patlolla Sanjeeva Reddy), అనంతరం ఎమ్మెల్యే ఆసుపత్రి వైద్యులతో, సిబ్బందులతో మాట్లాడుతూ... కరస్ గుత్తి గ్రామం చుట్టూ పక్కల చాలా తండాలు ఉన్నాయని అమాయకమైన పేద ప్రజలు ఆసుపత్రికి వస్తారని వారికి సరైన వైద్య సేవలను అందించాలని వైద్యులకు సూచించారు.
ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అందరూ తప్పకుండా వారి డ్యూటీ సక్రమంగా నిర్వహించాలని ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. అనంతరం ఆసుపత్రి యొక్క రిజిస్టర్ ఎమ్మెల్యే చెక్ చేయడం జరిగింది. అనంతరం ఆర్టీసీ బస్సు కరస్ గుత్తి నుంచి పటాన్చెరు వరకు బస్సును ప్రారంభించారు. ఉచిత బస్సు సౌకర్యాలు మహిళలు తగ్గించడం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండల యూత్ అధ్యక్షులు సచిన్ పాటిల్, గంగారెడ్డి, సోపాన్ రావు పాటిల్, నారాయణ జాదవ్ యస్టీ సెల్ నాయకులు, అంజి రెడ్డి పిఏసిఎస్ వైస్ చైర్మన్, మాజీ సర్పంచ్ అనిల్ పాటిల్, సంజీవ్ పాటిల్, రాజు పాటిల్, కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ రహీం, పండరి, తదితరులు పాల్గొన్నారు.