10-10-2025 11:27:41 PM
వనపర్తి టౌన్: మంత్రాలు, జాతకాలు వంటివి చేసి వచ్చే సంపాదనతో తృప్తి చెందక దేవుళ్ళ సొమ్ము కాజేసి తిరిగి జాతకం చెప్పి తన మహిమతో సొమ్ములు గుర్తించినట్లు ప్రజలను నమ్మించి దగా చేయడానికి కుట్ర చేసిన నిందితులు పోలీసులకు దొరికి పోయారని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ వివరాలు వెల్లడించారు. చిన్నంబావి మండల బెక్కెం గ్రామంలో తేదీ 07.10.2025 నాడు తెల్లవారుజామున 2:30 సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పీర్ల చావిడిలో ఉన్న ఇత్తడి పీర్లు, వెండి సామాగ్రి, ఆ వస్తువుల విలువ రూ,2,16,000/ గా దరఖాస్తు దారుడు ఇచ్చిన పిర్యాదు తో కేసు నమోదు చేశారు.
నేరస్తులు తేదీ 21.9.2025 అమావాస్య రోజున మధ్య రాత్రి పీర్ల చావిడిలో వున్న తాళం తీసి చెక్కపేటలో కట్టి ఉంచిన పీర్లను మరియు వెండి ఆభరణాలను దొంగిలించి ఫిర్యాదారుడు / నేరస్తుడి కారులో పెట్టుకొని, అనంతరం పీర్లదావిడికి తాళం వేసి అడ్డకల్ మండలం కందూర్ లో ఉన్న తన ఇంటిలో పెట్టుకున్నాడు.మరలవారు దొంగతనం చేసిన విషయము గ్రామస్తులకు ఎవరికి తెలియకపోవడంతో ఎలాగైనా గ్రామస్తులు తెలియజేయాలని తేదీ 7.10.2025 రోజున తెల్లవారుజామున అందాజా రెండున్నర గంటల సమయంలో నేరస్తులు కలిసి తాళం తీసి పీర్ల చావిడిలో వస్తువులను చిందరవందర చేసి సీసీ కెమెరాలు పగలగొట్టి పోలీసు కుక్కలు గుర్తు పట్టకుండా ఉండాలని పీర్ల చావిడి మందు వారి వెంట తెచ్చుకున్న కారం పొడిని చల్లి అటు నుంచి ఇంటికి వెళ్ళిపోయి ఎవరికి అనుమానం రాకుండా పీర్ల చావిడ్లో దొంగతనం జరిగిందని పోలీసు వారికి తప్పుడు దరఖాస్తు ఇచ్చినారు.
ఈ కేసును జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఆదేశాల మేరకు వెంటనే వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి పాషా అతని స్నేహితులను మరియు గ్రామంలోని కొంత మంది గ్రామస్తులను వివిధ కోణాల్లో తమదైన శైలిలో విచారణ చేయగా నేరస్థుడు పాషా పై అనుమానం రాగా వారిని విచారించగా వారు నేరం చేసినట్టు ఒప్పుకున్నారు. తరువాత అతని వద్ద దొంగిలించిన సొత్తును స్వాధీనపరుచుకొని, షామీర్ పాషా, మందాడి శివకృష్ణ,వనమల మురళీధర్, అనుకలి మహేష్, ఈ అందరిది బెక్కెం గ్రామం,చిన్నంబావి మండలం అరెస్టు చేసి ఈరోజు రిమాండ్ కు తరలించడం జరుగుతుందన్నారు. నేరస్తుని నుండి స్వాదీనం చేసుకున్న వెండి ఆభరణాలు, ఇత్తడి పీర్లు 13.680 కిలోలు,9.310 కిలోల వెండి ,ఆల్టో కారు,బజాజ్ డిస్కవరీబైక్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన వనపర్తి సీఐ కృష్ణయ్య, పోలీసు సిబ్బందిని ఎస్పీ క్యాష్ రివార్డ్ అందజేసి ప్రత్యేకంగా అబినధించారు.