08-06-2025 12:00:00 AM
మెంటల్ హెల్త్ ఇష్యూలకు ట్రీట్మెంట్గా రకరకాల థెరపీలు ఉంటాయి. అందులో భాగంగా ఎకో థెరపీని ఫాలో అవుతున్నారు చాలామంది. ఎకో థెరపీ అనేది ప్రకృతి చికిత్స. దీన్ని ఫారెస్ట్ థెరపీ, ఫారెస్ట్ బాత్, గ్రౌండింగ్, ఎర్తింగ్, షిన్రిన్యోకు లేదా సామి లోక్ అనే పేర్లతో పిలుస్తారు. ఇది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడుతుంది. ఈ థెరపీలో చేయాల్సిందల్లా.. ప్రకృతిని గమనిస్తూ మెల్లగా శ్వాస పిలుస్తూ వాటి మధ్యలో మౌనంగా కూర్చోవాలి.
క్యూ గార్డెన్స్కు చెందిన నేచర్, ఫారెస్ట్ బాతింగ్ హోస్ట్ సుసన్నే మెయిస్ ఈ థెరపీ గురించి చెప్తూ.. ‘మొదట ఇక్కడికి రండి, చూడండి, వినండి. ఇక్కడి గాలిని ఆస్వాదించండి, స్పర్శని ఫీల్ అవ్వండని’ అంటున్నారు. లాక్డౌన్ సమయంలో చాలామంది ఫారెస్ట్ బాతింగ్ ద్వారా మేలు పొందారు. కొంతమంది ఫారెస్ట్ బాతింగ్ వల్ల జీవితాలను కాపాడుకోగలిగారు. ప్రకృతితో ఏర్పరచుకునే బంధం ఇచ్చే ఫీలింగ్ను మాటల్లో చెప్పలేం.
చాలా బాగుంటుంది. ఈ థెరపీ తర్వాత ఇంతకు ముందు లేని కొత్త జీవితాన్ని గడుపుతున్నామని ఎంతో మంది చెబుతున్నారు.’ అన్నారామె. ఇంగ్లండ్లోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్హెచ్ఎస్) అనేది ఇంగ్లాండ్లో పబ్లిక్గా నిధులు సమకూర్చే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ 2022 మధ్య ఇంగ్లండ్లోని 50 లక్షల మంది పేషెంట్లుమెంటల్ హెల్త్ కేర్ తీసుకుంటున్నారు. ఆధునిక జీవన విధానంలో ఒత్తిడిని జయించేందుకు ఐదేండల్లో పదిలక్షలకు మందికి పైగా పేషెంట్లు పెరిగారు.