08-06-2025 12:00:00 AM
కళ్లు అలసినట్టు, పొడిబారినట్టు అనిపి స్తోందా? నొప్పి పుడుతున్నాయా? ఇలాంటి లక్షణాలకు చాలా కారణాలే ఉండొచ్చు. అ న్నింటికన్నా ముఖ్యమైంది కళ్లను అతిగా వాడటం. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్ల వంటి పరికరాల తెరలను మరీ ఎక్కువసేపు చూడటం కళ్లను ఒత్తిడికి గురిచేస్తాయి. వయసు మీద పడుతుండటమూ కారణం కావొచ్చు. మరి ఉపశమనం పొందటమెలా?
* కొన్ని తేలికైన జాగ్రత్తలతో కళ్ల అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు. నిపుణులు 20-20-20 సూత్రాన్ని దూరంలో ఉన్న వస్తువులను 20 సెకండ్ల పాటు చూడాలన్న మాట.
* డిజిటల్ పరికరాలు, టీవీలను చూస్తున్నప్పుడు తరచూ రెప్పలు ఆడించేలా చూసుకోవాలి.
* అరచేతులను కాసేపు రుద్దుకొని, వెంటనే కళ్ల మీద పెట్టుకుంటే కొద్దిగా అలసట తగ్గుతుంది.
* పిల్లలను ఆరుబయట ఆడుకో నివ్వట మూమేలే. దీంతో దూ రంగా ఉండే వస్తువులను ఎక్కువగా చూస్తారు. కళ్లకు హాయి కలుగుతుం ది. ఇది హ్రస్వదృష్టి తగ్గ టానికీ తోడ్పడుతుంది.
* కళ్లు పొడిబారినప్పుడు కృత్రిమ కన్నీటి చుక్కలను వేసుకోవచ్చు. దీంతో కళ్లలో తడి మెరుగవుతుంది.
* ఇంట్లో గాలి మరీ పొడిబారకుండా చూసు కోవాలి. వీలైతే హ్యుమిడి ఫయర్ పెట్టుకోవాలి. ఎయిర్ కండిషనర్ను పరిమితంగా వాడుకోవాలి.
* ఎండలో బయటకు వెళ్లినప్పుడు చలు వద్దాలు ధరించాలి. యూవీఏ, యూవీబీ రేడియేషన్ రెండింటినీ 99 నుంచి 100 శాతం వరకూ నిలువరించే సన్గ్లాసెస్ ఎంచుకోవాలి.
* ఎప్పటికప్పుడు చూపును పరీక్షించుకొని కళ్లద్దాలు, కాంటాక్టు లెన్సులను సరిచే సుకోవాలి.
* ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. తగినంత నీరు, ద్రవాలు తీసుకోవాలి. మం చి ఆహారం తినాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలాంటి మంచి అలవాట్లతో కంటి, చూపు సమస్యలకు దారితీసే జబ్బుల ముప్పు తగ్గుతుంది.
* ధూమపానం అలవాటుంటే వెంటనే మానేవేయాలి. ఇంట్లోనూ పొగలేవీ లేకుండా చూ సుకోవాలి.