08-06-2025 12:00:00 AM
బ్రెయిన్ ట్యూమర్, హైపోథైరాయిడిజం ఉన్న గర్భిణికి విజయవంతంగా చికిత్స
హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): మెడికవర్ హాస్పిటల్లో అరుదైన, అత్యంత ప్రమాదకరమైన న్యూరో- ఆంకాలజీ సందర్భంలో, బ్రెయిన్ ట్యూమర్, హైపోథైరాయి డిజం ఉన్న గర్భిణికి విజయవంతంగా సీజేరియన్ నిర్వహించారు. జన్మించిన శిశువు, తల్లి ఆరోగ్యంగా డిశ్చార్జి అయ్యారు. 27 ఏళ్ల సింధుజా 2015లో మిడ్బ్రెయిన్ గ్లియోమా కు రేడియేషన్ చికిత్స పొందారు.
ఈ చికిత్స ను మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అమిత్ కె జోత్వానీ ఆధ్వర్యంలో పొం దారు. ఆమె హైపోథైరాయిడిజం కోసం తర చూ మందులు వాడుతున్నారు.
డాక్టర్ అమి త్ సూచన మేరకు, ఆమె మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ను సంప్రదించగా, గైనకాలజిస్ట్ డాక్టర్ వరలక్ష్మి కెఎస్, న్యూరాలజీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాల నిపుణుల సహకారంతో పూర్తి మల్టీడిసిప్లినరీ మూ ల్యాంకనం జరిగింది. ప్రసవ పురోగతి లేకపోవడంతో జనరల్ అనస్తీషియా అత్యవసర లొయర్ సెగ్మెంట్ సీజేరియన్ సెక్షన్ నిర్వహించారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయ్యింది.