calender_icon.png 19 June, 2025 | 10:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పింఛన్, రేషన్ కార్డులు మంజూరు చేయకపోతే ఆందోళన తప్పదు: -దండి సురేష్

15-05-2025 01:48:05 AM

కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించిన సీపీఐ

భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం, మే 14 (విజయ క్రాంతి): సంపద పెంచి పేదలకు పంచుతామని చెబుతున్న ప్రభుత్వం ముందుగా సంక్షేమ పథకాలను పేదలందరికీ వర్తింపజేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల -అమలులో రాజకీయ వివక్ష తగదని ఆయన హితవు పలికారు.

ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని సమస్యలు -పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో బుధవారం కార్పోరేషన్ కార్యాలయాన్ని -ముట్టడించారు. అంతకు ముందు పట్టణంలో  ప్రదర్శన నిర్వహించారు. కార్పోరేషన్ కార్యాలయంలో చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులకు సిపిఐ కార్యకర్తలకు నడుమ తోపులాట చోటు చేసుకోండి. గేట్లు ఎక్కి లోపలకు వెళ్లేందుకు -ప్రయత్నించిన సిపిఐ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో ముట్టడి కార్యక్రమంలో ఉధృక్తత చోటుచేసుకొంది. దీంతో సిపిఐ కార్యకర్తలు కార్యాలయం ముందు -బైఠాయించారు. ఆందోళనకారులను ఉద్దేశించి దండి సురేష్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వ -వైఫల్యం కనిపిస్తుందన్నారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల అమలు ఇతరత్రా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరిగిందని ప్రజలు గ్రహించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారని, ప్రజల ఆశలకు అనుగుణంగా పాలన చేయాల్సిన -అవసరం ఈ ప్రభుత్వంపై ఉందన్నారు.

ఇందిరమ్మ ఇండ్లను అధికార పార్టీ నాయకులకే ఇండ్లను కేటాయించడం ఏ -మేరకు సమాంజసమని ఆయన ప్రశ్నించారు. పట్టణంలో అనేక ఏళ్లుగా రెక్కల కష్టంపై ఆధారపడి జీవిస్తున్న పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలన్నారు. పదేళ్లుగా పింఛన్కు, కొత్త రేషన్ కార్డులకు ప్రజలు -నోచుకోలేదని వెంటనే అర్హులైన పేదలందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు అందించాలని సురేష్ డిమాండ్ చేశారు.

రెండు దశాబ్దాలుగా పట్టణీకరణ వేగం పుంజుకుందని వ్యవసాయ రంగ సంక్షోభం కారణంగా ప్రజలు జీవనాధారం కోసం పట్టణాలకు వచ్చారని దీనితో మౌలిక వసతుల కల్పన జరగాల్సి ఉందన్నారు. ఖమ్మం కార్పోరేషన్కు -సంబంధించి విలీన గ్రామ పంచాయతీల్లో అభివృద్ధికి నోచుకోవడం లేదని పలు సమస్యలు అపరిష్కృతంగా -ఉన్నాయని సురేష్ తెలిపారు.

అపరిష్కృత సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని గతంలో పలు మార్లు వినతి పత్రాలు సమర్పించామని అయిన ఫలితం లేకపోవడంతో కార్యాలయ ముట్టడికి నగర సమితి ఆధ్వర్యంలో పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు.

నగరంలో నివసిస్తున్న పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు-సంక్షేమ పథకాల అమలును వివక్షకు తావులేనివిధంగా పేదలకు అందించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోని పక్షంలో ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని -ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి ఎస్కే జానిమియా, జిల్లా కార్యవర్గ సభ్యులు యర్రా బాబు, శింగు నర్సింహారావు, పోటు కళావతి, బిజి క్లెమెంట్, మహ్మద్ సలాం, తోట రామాంజనేయులు. మేకల శ్రీనివాసరావు, నగర సహాయ కార్యదర్శులు పగడాల మల్లేష్, యానాలి సాంబశివరెడ్డి, జిల్లా సమితి సభ్యులు బండి సత్యం ది లక్ష్మి నారాయణ, నూనె శశిధర్, ఏనుగు గాంధీ, వరదా నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.