15-05-2025 01:49:29 AM
వికారాబాద్, మే-13 రెవెన్యూ గ్రామసభల ద్వారా ఆర్జీలను స్వీకరించి నూతన చట్టం ప్రకారం భూ సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.బుధవారము ధరూర్ మండలం కేరెల్లి గ్రామం, కుకింద గ్రామం లో ఏర్పాటు చేసిన భూ భారతి రైతు సదస్సు లల్లో పాల్గొన్నారు.ఈ సందర్బంగా రైతుల నుండి స్వీకరించిన దరఖాస్తు లను పరిశీలించారు.
రైతులు భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో ఉచితంగా దరఖాస్తులు సమర్పించవచ్చునని తెలిపారు.భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వ హిస్తున్నట్లు, ప్రజలు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టం అమలులో భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా నుండి దరూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేపథ్యంలో, భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సులో పాల్గొనాలని, దరఖాస్తులు స్వీకరించి నూతన చట్టం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భూ సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.గతంలో ప్రజలు తహసీల్దార్,ఆర్డీఓ లేదా కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు అధికారులు స్వయంగా గ్రామాలకే వచ్చి ప్రజల నుండి దరఖాస్తు లను స్వీకరిస్తున్నామని అన్నారు.