calender_icon.png 3 August, 2025 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో యూరియా కొరత లేదు

02-08-2025 12:44:43 AM

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు1, (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో యూ రియా కొరత లేదని, రైతులు ఎలాంటి ఆం దోళనకు గురికావాల్సిన అవసరం లేదని  క లెక్టర్ జితేష్ వి. పాటిల్ స్పష్టం చేశారు. శుక్ర వారం  ఐడీఓసీ కార్యాలయంలో వ్యవసా య, సహకార శాఖ, సంబంధిత శాఖల  అ ధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం ని ర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో యూరియా నిల్వలు, సరఫరా, వినియోగ పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో తగినంత యూరియా నిల్వలు ఉన్నాయని, పంటల సాగుకు అవసరమైనంత సరఫరా చేయడానికి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నా మన్నారు. రైతులు అవసరానికి మించి యూరియాను కొనుగోలు చేయడం వల్ల కృత్రిమంగా డిమాండ్ పెరిగినట్టు కనిపిస్తోం దని, దీని వల్ల అయోమయ పరిస్థితులు ఏర్పడుతున్నాయని వివరించారు.

యూరి యాను పంటల సాగుకు కాకుండా ఇతర అ వసరాల కోసం మళ్లించరాదని, అలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు. యూరియా సరఫరా పై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, ఏ ఒక్కరు కూడా దుర్వినియోగానికి పాల్పడ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. యూరియా పంపిణీ ప్రక్రియను పూర్తిగా పా రదర్శకంగా నిర్వహించాలని, ప్రతి సప్లై ఆధా ర్ నెంబర్ ఆధారంగా నమోదు కావాలని క లెక్టర్ సూచించారు.

ఆధారాలు లేకుండా యూరియా సరఫరా చేసిన అధికారులపై తగిన చట్టపరమైన చర్యలు తప్పవని హె చ్చరించారు. రైతులకు అవసరమైనంత మేర కు మాత్రమే యూరియా ఇవ్వాలని, నిల్వలు నిరంతరం తనిఖీ చేస్తూ సంబంధిత నివేదిక లు సమర్పించాలని సూచించారు. రైతులు యూరియాకు బదులుగా నానో యూరియా ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

నానో యూరియా వినియో గం వల్ల  ఖర్చు తగ్గుతుందని, నేల ఫలవం తత పెరుగుతుందని, పర్యావరణానికి హానిక రం కలగదని చెప్పారు.  నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పిం చాలన్నారు. గ్రామస్థాయిలో రైతు వేదికలు, ఫీల్ డెమోల్లో నానో యూరియా ప్రయోజ నాలను వివరించాలని, నానో యూరియా వినియోగాన్ని పెంపొందించాలన్నారు.

ఈ  సీజన్లో 1000 ఎకరాల మునగ సాగు లక్ష్యం గా పెట్టుకోవాలని, ఈ  పంట ద్వారా రైతుల కు తక్కువ ఖర్చుతో మంచి ఆదాయం లభి స్తుందన్నారు.ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, డీఎస్‌ఓ అవధాని శ్రీనివాసరావు, డిపిడి ఆత్మ బి. సరిత, మా ర్క్ఫెడ్ డిఎం సునీత, సొసైటీ  సీఈఓలు, వ్య వసాయ శాఖ ఏ డి ఏ లు, ఏవోలు  మరి యు తదితరులు పాల్గొన్నారు.