28-03-2025 12:00:00 AM
వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మార్చి 27 (విజయక్రాంతి): ఒకే దేశం ఒకే ఎన్నిక జరగాలని వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు అన్నారు. గురువారం జైనూర్, కెరామేరి, సిర్పూర్ యు, లింగాపూ ర్ మండలాలలో ఒకే దేశం ఒకే ఎన్నికపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలంతో కలసి ఆయన హాజరయ్యా రు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించాలన్న సంకల్పంతో ప్రజా అభిప్రాయ సేక రణ చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మండల కన్వీనర్ గడ్డల కరణ్ ఆయా మండలాల కన్వీనర్లు, కో కన్వీనర్లు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.