02-06-2025 02:38:35 AM
ప్రధాని షెహబాజ్ షరీఫ్
ఇస్లామాబాద్, జూన్ 1: పాకిస్థాన్ ఇకపై భిక్షాపాత్ర పట్టుకుని మిత్రదేశాలకు వెళ్లదని మిత్రదేశాలకు తెలుసని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్థాన్ మిత్రదే శాలతో సంబంధాలు మెరుగుపరుచుకుందని పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడి, ఆవిష్కరణల్లో పాక్ను చాలా దేశాలు భాగస్వామిగా చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
దేశంలో సహజవనరులకు కొదువ లేదని వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకుంటే ఆర్థిక సవా ళ్లను అధిగమించవచ్చని తెలిపారు. బలూచిస్థాన్లోని క్వెట్టా కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాక్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.