02-06-2025 02:43:14 AM
పనులను పరిశీలించిన కమిషనర్ కర్ణన్
హైదరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): మలక్పేట్లో డ్రైనేజీ ఓవర్ ఫ్లోతో ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్ నివారణకు జలమండలి, జీహెచ్ఎంసీ సంయుక్తంగా చేపట్టిన పనుల ను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదివారం పరిశీలించారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను పరిశీలించారు. నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి కుందన్ బాగ్ వరకు చేపట్టిన ఆర్డీపీ పనులను పరిశీలించారు.
మలక్పేట్లో ట్రాఫిక్ జామ్ నివారణకు రాత్రి సమయంలో చేపడుతున్న డ్రైనేజీ పనుల పురోగతిని పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిపై ఎస్ఈ మహేశ్వర్రెడ్డిని వివరణ కోరారు.
ప్రస్తుతం తాత్కాలికంగా ట్రాఫిక్ జామ్కు అవకాశం లేదని యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి శాశ్వత పరిష్కారం చూపుతామని ఎస్ఈ సిఈ కమిషనర్కు వివరించారు. కమిషనర్ వెంట మె యింటెనెన్స్ సీఈ సహదేవ్ రత్నాకర్, జోనల్ ఎస్ఈ మహేశ్వరరెడ్డి, జ లమండలి అధికారులు తదితరులు ఉన్నారు.