24-06-2025 12:29:45 PM
కిలో వెండితో పాటు నగదు ఎత్తుకెళ్లిన దొంగలు
మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలోని దొంతుల వాడలో ఐరన్ హార్డ్వేర్ దుకాణ యజమాని ఓల్లాల వెంకన్న ఇంట్లో దొంగలు సోమవారం రాత్రి చొరబడి సొత్తు ఎత్తుకెళ్లారు. దాదాపు కిలో వెండి.. రూ. 30 వేల నగదు తో పాటు పలు విలువైన సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు రోదిస్తూ తెలిపారు. సమాచారం అందుకున్న మంథని ఎస్ఐ డేగ రమేష్ తెల్లవారుజామున ఘటన స్థలానికి చేరుకొని దొంగల కోసం అన్వేషిస్తున్నారు.