21-06-2025 08:16:20 PM
నడిగూడెం: మండల పరిధిలోని సిరిపురం సబ్ స్టేషన్ పరిధిలోని సిరిపురం పీడర్ గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి మూడు రోజులుగా ముప్పు తిప్పలు పెడుతుందని శనివారం రైతులు వాపొయ్యారు. కిలోమీటర్ ల పొడవున ఈ ఫీడర్ ఉండడంతో విద్యుత్ అధికారులకు తల నొప్పిగా మారిందని అధికారులు వాపోతున్నారు. ఏ మాత్రం చిన్న గాలి వచ్చిన రోజుల తరబడి విద్యుత్ ఆగిపోతుందని, ఈ ఫీడర్ పై ఆధారపడిన రైతులకు, బ్రిక్స్ తయారీ ప్లాంట్ వారికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, దీనివలన రాష్ట్ర ప్రభుత్వనికి కళంకం వస్తుందనీ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివలన రైతులు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు వెంటనే సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.