l వారిలో ఇద్దరు మైనర్లు
l 5 కిలోల గంజాయి స్వాధీనం
రాజన్న సిరిసిల్ల/హనుమకొండ, ఏప్రిల్ 21 (విజయక్రాంతి) : గంజాయి విక్రయానికి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. వేములవాడ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన వికాస్.. ఒడిశా కు చెందిన ఇద్దరు మైనర్లతో ఒడిశా నుంచి 5 కిలోల గంజాయి తెప్పించి వేములవాడలో విక్రయించేందుకు తీసుకువచ్చా రు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడు లు నిర్వహించి 5 కిలోల గంజాయిను స్వాధీ నం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు. వికాస్ను రిమాండ్కు తరలించి, మైనర్లను జువైనల్ హోమ్కు పంపించినట్లు ఎస్పీ వెల్లడించారు.
గంజాయి తాగుతున్న నలుగురి పట్టివేత
గంజాయి తాగుతూ పట్టుబడిన నలుగురు యువకులను హనుమకొండ పోలీసు లు ఆదివారం అరెస్ట్ చేశారు. హనుమకొండ ఏసీపీ దేవేందర్రెడ్డి కథనం ప్రకారం.. పద్మాక్షి కాలనీ శ్మశాన పరిసర ప్రాంతాల్లో కొందరు యువకులు గంజాయి తాగుతున్నట్లుగా సమాచారం రావడంతో ఎస్సై శ్రీనివాస్ సిబ్బందితో వెళ్లి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు కిలోల గంజాయితో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో జంగం వంశీకృష్ణ, చిల్పూరు మండలం వంగాలపల్లికి చెందిన అరూరి వంశీ, పద్మాక్షి కాలనీకి చెందిన ఐత శివ, పెద్దపల్లి జిల్లాకు చెందిన మరో వ్యక్తి ఉన్నట్లు వెల్లడించారు.