03-07-2025 11:58:18 PM
పశ్చిమ మాలిలోని సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి ముగ్గురు భారతీయులను ఎత్తుకెళ్లిన దుండగులు..
న్యూఢిల్లీ: మాలిలోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ముగ్గురు భారతీయ కార్మికులను అల్ సంబంధం ఉన్న ఉగ్రవాదులు అపహరించుకుపోయారు. ఈ విషయాన్ని గురువారం విదేశాంగశాఖ అధికారులు(Foreign Ministry officials) ధ్రువీకరించారు. పశ్చిమాఫ్రికా దేశమైన మాలిలో ఇటీవల అనేక ప్రాంతాల్లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. భారత పౌరుల అపహరణపై విదేశాంగశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. వారిని విడుదల చేసేందుకు కృషి చేయాలని మాలి ప్రభుత్వాన్ని కోరింది.
దుండగులు తుపాకులతో వచ్చినట్టు స్థానిక నివేదికలు పేర్కొంటున్నాయి. అల్ ఖైదా గ్రూప్(Al Qaeda group) అయిన జమాత్ నుస్రత్ అల్ వల్ (జేఎన్ఐఎం) మాలి వ్యాప్తంగా దాడులు చేస్తోంది. ఈ ముగ్గురి అపహరణ వెనుక కూడా ఈ గ్రూప్ హస్తమే ఉన్నట్టు అనుమానిస్తున్నారు. భారత విదేశాంగశాఖ వీరి అపహరణను తీవ్రంగా ఖండించింది. అపహరణకు గురైన భారతీయులను రక్షించాలని మాలి అధికారులను కోరింది. మాలిలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది.