30 July, 2026 | 5:48 PM

Breaking News

రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి   •   గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •  

నెల్లూరులో కంటైనర్ లారీ బీభత్సం.. ముగ్గురు మృతి

11-11-2025 01:33 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరులో(Nellore) కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. వేగంతో దూసుకొచ్చిన కంటైనర్ అదుపుతప్పి టాటా ఏస్ వాహనం, మూడు బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కంటైనర్ లారీ చేపల లోడుతో వెళ్తుంది. నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ వద్ద జాతీయరహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదనాకి కారణమని పోలీసులు పేర్కొన్నారు.