15 April, 2026 | 12:58 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నగార సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

29-03-2025 10:31 PM

ఉగాది సంబరాలకు సర్వం సిద్ధం.. జవ్వాది రవి 

చర్ల (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో గల రాహుల్ విజ్ఞాన విద్యాలయం హాస్టల్ ప్రాంగణంలో ఉగాది పండుగ పురస్కరించుకొని నగార ఉగాది సంబరాలు నిర్వహిస్తుంది ఇందులో  భాగంగా శనివారం మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలో సుమారు 30 మంది మహిళలు పాల్గొని వారి రంగవల్లిలను 60 నిమిషాల వ్యవధిలో  అద్భుతమైన రంగులతో రూపుదీదిద్దారు.

ప్రధమ ద్వితీయ తృతీయ ప్రత్యేక బహుమతికి సంబంధించిన బహుమతులను ఆదివారం గ్రంథాలయం ప్రాంగణం సురేష్ ఓపెన్ ఆర్ట్స్ థియేటర్ లో సాయంత్రం జరిగే ఉగాది సంబరాలు నగార సాంస్కృతిక సేవా సంస్థ వారు నిర్వహించే కార్యక్రమాలను ఈ బహుమతులను ప్రధానం చేస్తారనీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి నగార సంస్కృత సేవ సంస్థ కమిటీ సభ్యులు జవ్వాది రవి, తడికల లాలయ్య, ఆడెపు ముత్యాలరావు, సుందర పెద్దిరాజు, సిహెచ్ వీరభద్రం, మేడిచర్ల కుమార్, కోట రత్నాజీ, గూడపాటి సతీష్, సి ఎల్ నారాయణ (చిన్న), జి లక్ష్మణ్ కుమార్, తడకల నరేష్, తంగెళ్లపల్లి శంకరాచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.