21-06-2025 02:33:25 AM
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 20 (విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్ రావు మండలం తాడిచర్ల అటవీ ప్రాంతంలో పెద్దపులి అడుగులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎడ్లపల్లి గ్రామంలో గుర్రం రాజయ్యకు చెందిన ఆవుపై పెద్దపులి దాడి చేసిన సంఘటన శుక్రవారం వెలుగు చూడడంతో పులి సంచరిస్తుందన్న సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు.
సి సి ఎఫ్ ఓ ప్రభాకర్ రెడ్డి, కొయ్యూరు అటవీశాఖ అధికారి రాజేశ్వరరావు, డిఎఫ్ఓ నవీన్ రెడ్డి పులి పాదముద్రలను గుర్తించి ఆవును పులి చంపినట్లుగా ప్రాథమికంగా గుర్తించి, పులి జాడల కోసం ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. పులి సంచరిస్తుందన్న ప్రచారంతో కొయ్యూరు, రుద్రారం, కిషన్ రావు పల్లి, పెద్దతోండ్ల, షాత్రాజు పల్లె, తాడిచర్ల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
పులి సంచారం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతాల్లోకి ప్రజలు వెళ్లవద్దని పశువుల కాపరులు పులిహారవాళ్ళు కనిపిస్తే సమాచారం అందించాలని అటవీశాఖ అధికారులు కోరుతున్నారు.