21-06-2025 02:33:53 AM
కోదాడ జూన్ 20 : కోదాడ ప్రాంతానికి చెందిన కార్గిల్ యుద్ధ వీరుడు నాయక్ గోపయ్య దేశం కోసం చేసిన సేవలు మరువలేని అని ఆర్మీ ఆఫీసర్లు అవల్దార్ రమేష్ రెడ్డి, అవల్దార్ కింగ్ ఆల్ లక్ష్మణ్, సుబేదార్ పనాంజి, అహల్దార్ సయ్యాజి లు అన్నారు. ఐ వి ఓ సూర్యపేట జిల్లా ఆధ్వర్యంలో కోదాడలో నాయక్ గోపయ్య 1999 కార్గిల్ యుద్ధ వీరుడు భారత ప్రభుత్వం తరఫున వీరమరణం పొందిన నాయక్ గోపయ్యకు ఢిల్లీ ఆర్మీ హెడ్ నుంచి అవార్డునుగోపయ్య భార్య వీరనారి శారదకు శుక్రవారం అందించారు.
గూండా మధుసూదన రావు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో యూత్ వింగ్ ప్రెసిడెంట్ పైడిమర్రి సత్యబాబు, ఎంఈఓ సలీం షరీఫ్, మెటల్స్ వై ఉపేందర్ రావ్, కే వెంకన్న, జే వెంకన్న, ఐ వి ఓ యూత్ కమిటీ సెక్రటరీ నవీన్ గోవింద్, జగనీ ప్రసాద్, రహీం, భరత్, కే నవీన్ తదితరులు పాల్గొన్నారు.